
కర్ణాటక రాజకీయ పరిస్థితులు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో అందిరితోపాటే తెలుగు ప్రజలు ముఖ్యంగా ఏపీ ప్రజలు గమనించారు. చాలా మందిలో తట్టిన ఆలోచన ఏమంటే కర్ణాటక పరిస్థితులు 2019 ఎన్నికల్లో ఏపీలో పునరావృతం అయితే ఏంటి పరిస్థితి?.. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ద్వారా జనాల్లోకి వెళుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు, టీడీపీ, వైసీపీ సంప్రదాయ ఓటును కూడా చీల్చగలిగితే ఏపీలో హంగ్ ఏర్పడే అవకాశాలుంటాయని, అప్పుడు కర్ణాటకలో ప్రస్తుతం కుమారస్వామిలాగే పవన్ కళ్యాణ్ కూడా సీఎం అవుతారనేది జనసేన అభిమానులు చెబుతున్న మాట.
This post is also available in : English
Be the first to comment