
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమారుడు వైష్ణవ్(21) గుండెపోటుతో చనిపోయారు. గుండె నొప్పి వచ్చిందని చెప్పడంతో వైష్ణవ్ను ముషీరాబాద్లోని గురునానక్ ఆసుపత్రి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వైష్ణవ్ తుదిశ్వాస విడిచారు. వైష్ణవ్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దత్తాత్రేయ కుటుంబాన్ని పలువురు రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కుమారుడిని పోగొట్టుకున్న దు:ఖాన్ని దత్తాత్రేయ దిగమింగుకోలేకపోతున్నారు.
This post is also available in : English
Be the first to comment