
బాబాయ్కి అబ్బాయ్ తోడవుతున్నాడు. జనసేనలోకి రాం చరణ్ ఎంటర్ కాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రంగంలోకి దిగితే ఇక జనసేన ఉప్పెనలా అవుతుందని అభిమానులు సంబరపడుతున్నారు. బాబాయ్ చెబితే తాను జనసేన కోసం ప్రచారం చేస్తానని రాం చరణ్ వెల్లడించాడు. నిజానికి ప్రజారాజ్యం సమయంలోనే తాను ప్రచారం చేద్దామని అనుకున్నానని అప్పుడు పవన్ బాబాయ్ వద్దని చెప్పాడని చరణ్ అన్నాడు. కానీ ఇప్పుడు ఆయన చెబితే ప్రచారం చేస్తానని మనసులో మాట చెప్పాడు.
అంతకుముందు నాగబాబు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ పవన్ చెబితే తాను ప్రచారం చేస్తానని చెప్పాడు. శ్రీరెడ్డి వ్యవహారం జరిగినప్పుడు మరోసారి నాగబాబు, అల్లూ అరవింద్, అల్లూ అర్జున్, సాయి ధరమ్ తేజ్ ఏకమయ్యారు. తమపై కుట్రలు చేయొద్దని, ఇలాంటివి ప్రజారాజ్యం సమయంలోనే చాలా చూసామని అల్లూ అరవింద్ అన్నారు. దీంతో భవిష్యత్తులో చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన కోసం ప్రచారం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
This post is also available in : English
Be the first to comment