
ఐపిఎల్ – 2018 టైటిల్ చెన్నై సొంతం చేసుకుంది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీ చేయడంతో సన్రైజర్స్పై ధోనీ సేన సునాయాసంగా విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడో సారి ఐపిఎల్ టైటిల్ను చెన్నై జట్టు అందుకుంది. టాస్ గెలిచిన ధోనీ మొదటిగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్రైజర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ ప్రారంభించిన చెన్నై 18.3 ఓవర్లలోనే 181 పరుగులు చేసింది. చెన్నై జట్టు ఆదిలో నిదానంగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఓపెనర్ షేన్ వాట్సన్ తర్వాత విజృంభించాడు. 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 117 పరుగులు చేశాడు. దీంతో ముంబైలోని వాంఖడే స్టేడియం చెన్నై జట్టు అభిమానుల అరుపులతో హరెత్తింది.
స్కోర్ వివరాలు..
సన్రైజర్స్ : 178/6 (20 ఓవర్లకు)
చెన్నై సూపర్ కింగ్స్ : 181/2 (18.3 ఓవర్లలో)
This post is also available in : English
Be the first to comment