
ఐపిఎల్ – 2018లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లలో సన్రైజర్స్ మిస్టరీ బౌలర్ రషీద్ ఖాన్ ఒకడు. ఐపిఎల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచాడు. ఈ సీజన్లో 17 మ్యాచ్లాడిన రషీద్ 21 వికెట్లు తీశాడు. పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై (24 వికెట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రషీద్ ఖాన్ చూపించిన ఆల్రౌండ్ ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం టీట్వంటీ క్రికెట్ రషీద్ ఖాన్ ఉత్తమ బౌలర్ అని సచిన్ కామెంట్ చేశాడు. ఈ కామెంట్పై రషీద్ ఖాన్ స్పందిస్తూ తాను జట్టు సభ్యులు ఉన్న బస్సు ఎక్కుతుండగా సచిన్ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్ను తనకు ఒకరు మెస్సేజ్ చేశారని, అది చూసి తాను చాలా ఆశ్చర్యపడ్డానని చెప్పాడు. అయితే భారత్లో టాప్ క్రికెటర్లు తమ పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తాను కూడా తన పాపులారిటీని స్వదేశంలో ఆస్వాదిస్తున్నాడా అన్న రషీద్ ఖాన్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. ఆఫ్గనిస్థాన్లో తమ దేశాధ్యక్షుడి తర్వాత బహుశా తానే పాపులర్ అనుకుంటా అని సిగ్గుపడుతూ సమాధానమిచ్చాడు.
This post is also available in : English
Be the first to comment