
ఐపిఎల్ -2018లో ఫైనల్కు చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ యాత్రలో ఓపెనర్ శిఖర్ ధావన్ పాత్ర చాలా కీలకమైనది. 16 మ్యాచ్లాడిన గబ్బర్ 497 పరుగులు చేసి సత్తా చాటాడు. టోర్నీ ముగిసిన అనంతరం ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి స్పందించాడు. క్రికెట్లో ఏమైనా లక్ష్యాలున్నాయా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అలాంటిదేమీ లేదని, తనలో ఇంకా చాలా క్రికెట్ ఉందని చెప్పాడు. భారత క్రికెట్ జట్టులోకి తాను లేట్గా ఎంటరయ్యానని, కాబట్టి తనకు సాధ్యమైనంత వరకు ఆటను కొనసాగిస్తూనే ఉంటానని చెప్పాడు. తనకోసం, టీమిండియా కోసం ఇంకా బాగా ఆడాల్సి ఉందని అన్నాడు. తనలో ఇంకా క్రికెట్ సామర్ధ్యం ఉందని, తనకింకా చాలా సాధించగలననే నమ్మకం ఉందని అన్నాడు. క్రికెట్లో తన పరుగుల దాహం ఇంకా తీరలేదని శిఖర్ ధావన్ చెప్పాడు.
This post is also available in : English
Be the first to comment