
నర్సీపట్నం: వరదలతో అల్లాడిపోతోన్న కేరళకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల సాయం ప్రకటించారు. తాజా విపత్తు నుంచి కేరళ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు. కేరళ ప్రజల కోసం తాను ప్రార్దిస్తున్నానంటూ ట్విటర్ ద్వారా తెలిపారు. కేంద్రం అన్నివిధాలా సాయమందించి కేరళను ఆదుకోవాలని జగన్ కోరారు.
The devastation caused by the #KeralaFloods is gut-wrenching. My thoughts & prayers are with the people of Kerala in these testing times. Urge the Central govt to provide all possible assistance to support relief & rehabilitation measures for people affected by this calamity.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 18, 2018
జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్రలో ఉన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం ధర్మవరం క్రాస్ నుంచి 241వరోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. పాయకరావు పేట నియోజకవర్గంలోకి వైయస్ జగన్ ప్రవేశించారు. యండపల్లి, జల్లూరు, పాత తంగేడు, తంగేడు క్రాస్, కోటవురట్ల, కైలాసపట్నం వరకు పాదయాత్ర చేయనున్నారు.
జననేత వెంట జనం అడుగులు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భవిష్యత్పై భరోసానిస్తూ ముందుకు సాగుతున్న వైయస్ జగన్.#PrajaSankalpaYatra pic.twitter.com/QptWASIiyv
— YSR Congress Party (@YSRCParty) August 20, 2018
రైతులు, చిన్నారులతో జగన్ ముచ్చటిస్తూ ముందుకు సాగుతున్నారు. జోరున వాన కురుస్తున్నా జగన్ తన పాదయాత్రను ఎక్కడా ఆపడం లేదు. మున్ముందుకే సాగుతున్నారు. వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జగన్ వెంట నడుస్తున్నాయి.
ధర్మసాగరంలో వైయస్ జగన్తో కలిసి నడిచిన మహిళా కూలీలు.#PrajaSankalpaYatra pic.twitter.com/10eovXX5kN
— YSR Congress Party (@YSRCParty) August 20, 2018
Be the first to comment