
నల్గొండ: నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఈ ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింది. అన్నపర్తివద్ద వద్ద అద్దంకి హైవేపై వద్ద ఆయన వాహనం అవతల రోడ్డులోని మరో వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన హరికృష్ణను వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయమైంది. హరికృష్ణ కారు నుజ్జునుజ్జయింది.
ఘటన గురించి తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఘటనాస్థలానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ హైదరాబాద్ బయలుదేరారు.
హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009లో కూడా నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ కన్నుమూశారు.
Be the first to comment