
విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి బహిరంగ సభలో మాట్లాడడానికి ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు నివాళులర్పించారు. హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతున్నట్టు ప్రకటించిన జగన్.. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అనంతరం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు అవినీతి ప్రతీ దాంట్లోనూ కనిపిస్తోందని జగన్ ఆరోపించారు. చివరికి పేదలకు ఇచ్చే ప్లాట్లను కూడా వదలడం లేదన్నారు. చంద్రబాబు ప్లాట్లు ఇస్తే తీసుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక ఆ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లిని గ్రేటర్ విశాఖలో కలిపిన తర్వాత పన్నుల బాదుడు ఎక్కువైందని పేర్కొన్న జగన్, తాము అధికారంలోకి వచ్చాక అనకాపల్లిని జిల్లాగా మారుస్తామని స్పష్టం చేశారు.
Be the first to comment