
కొత్తపల్లి: ప్రకాశం జిల్లా పి.సి.పల్లె మండలం కొత్తపల్లిలో అన్నావదినపై తమ్ముడు హత్యాయత్నం చేసిన ఘటన కలకం రేపింది. అన్నావదిన నిద్రిస్తున్న సమయంలో తమ్ముడు కత్తితో దాడిచేశాడు. అప్రమత్తమైన ఇతర కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వారు వారిద్దరినీ చికిత్స కోసం ఒంగోలులోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కుటుంబకలహాలే హత్యయత్నానికి కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. అన్నా వదినలను అతడు ఎందుకు చంపాలనుకున్నాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Be the first to comment