
రాజ్కోట్ టెస్ట్ మూడు రోజుల్లోనే ముగిసింది. వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ బ్యాట్స్మన్ పోవెల్ 83 పరుగులు చేశారు. విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విండీస్ ఘోర పరాజయం పాలైంది. రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 57 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. జడేజా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీశారు.
తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు, షమీ 2 వికెట్లు, ఉమేశ్, జడేజా, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు.
భారత్ తమ తొలి ఇన్నింగ్స్ 649/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాట్స్మెన్లో పృథ్వీ షా 134 పరుగులు చేశారు. తొలి టెస్ట్లోనే సెంచరీ బాది పృథ్వీ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. రంజీ, ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా తొలి మ్యాచ్లోనే పృథ్వీ షా సెంచరీలు కొట్టాడు. పుజారా 86, కోహ్లీ 139, రహానె 41, రిషభ్ పంత్ 92, జడేజా (నాటౌట్) 100, అశ్విన్ 7, కుల్దీప్ యాదవ్ 12, ఉమేశ్ యాదవ్ 22, షమి (నాటౌట్) 2 పరుగులు చేశారు.
Be the first to comment