
అమరావతి: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను తమ ప్రభుత్వం సరికొత్తగా ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే నెల మొదటి వారంలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అయితే గత ప్రభుత్వం మాదిరిగా ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ కాకుండా పేదలు ఎక్కువగా ఉండే ప్రభుత్వాసుపత్రి వంటి స్థలాల్లో అన్నా క్యాంటీన్లు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఒక్కో అన్న క్యాంటీన్కు టీడీపీ నాయకులు రూ. 50 లక్షల మేరకు అవినీతి చేశారని బొత్స ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కొనసాగించడాన్ని గమనించవచ్చు. అంతకుముందు స్కూల్ విద్యార్ధినిలకు సైకిళ్ల పంపిణీని కొనసాగించమని సీఎం జగన్ ఆదేశించారు. తాజాగా అన్న క్యాంటీన్లను కూడా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
This post is also available in : English
Be the first to comment