
కటక్: వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను 2-1తో భారత్ గెలుచుకుంది. కటక్లో జరిగిన చివరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 316 పరుగుల విజయలక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. భారత బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ 85, రోహిత్ శర్మ 63, కేఎల్ రాహుల్ 77 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 7, రిషభ్ పంత్ 7, కేదార్ జాదవ్ 9 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. పొలార్డ్ 74, పూరన్ 89 పరుగులు చేశారు.
It’s 2-1 India! Virat Kohli and Co. beat West Indies by four wickets in the third ODI to cap off 2019 with a series win. ????#INDvWI #TeamIndia @paytm pic.twitter.com/fJpP37tEBJ
— BCCI (@BCCI) December 22, 2019
విండీస్పై భారత్ వరుసగా పదో సిరీస్ గెలుకోవడం విశేషం.
– మారుతి ఆజాది, హైదరాబాద్.
Be the first to comment