
దుబాయ్: 2020 టీ20 ప్రపంచకప్ పోటీలు వాయిదాపడ్డాయి. ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కీలక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ పోటీలను ఐసీసీ వాయిదా వేసింది.
BREAKING: The 2020 @T20WorldCup has been postponed.
DETAILS 👇 https://t.co/O8pZAjwf9R pic.twitter.com/ZGF5pKxS7n
— ICC (@ICC) July 20, 2020
అదే సమయంలో 2021 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2021 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2021 నవండర్ 14న జరగనుంది.
2022 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2022 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2022 నవంబర్ 13న జరగనుంది.
2023 టీ20 ప్రపంచ కప్ పోటీలు 2023 అక్టోబర్-నవంబర్ మధ్య నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ 2023 నవంబర్ 26న జరగనుందని ఐసీసీ తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ పోటీలు జరగాలి. కానీ, కరోనా నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహించలేమని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
ICC Men’s T20 World Cup 2021 will be held October –Nov 2021 with the final on 14 Nov 2021.ICC Men’s T20 World Cup 2022 will be held Oct –Nov 2022 with the final on 13 Nov 2022. ICC Men’s Cricket World Cup 2023 will be held in India Oct-Nov 2023 with the final on 26 Nov: ICC
— ANI (@ANI) July 20, 2020
Be the first to comment