
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ గాంధీగిరి చూపారు. రాజ్యసభలో వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదం సమయంలో రభస కారణంగా సస్పెండై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న ఎంపీలకు చాయ్, బిస్కట్లు అందించారు. వారితో కులాసాగా మాట్లాడారు.
#WATCH: Rajya Sabha Deputy Chairman Harivansh brings tea for the Rajya Sabha MPs who are protesting at Parliament premises against their suspension from the House. #Delhi pic.twitter.com/eF1I5pVbsw
— ANI (@ANI) September 22, 2020
సస్పెండై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న ఎంపీలకు చాయ్, బిస్కట్లు అందించడం ద్వారా హరివంశ్ గొప్పతనం చాటుకున్నారంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
To personally serve tea to those who attacked and insulted him a few days ago as well as those sitting on Dharna shows that Shri Harivansh Ji has been blessed with a humble mind and a big heart. It shows his greatness. I join the people of India in congratulating Harivansh Ji.
— Narendra Modi (@narendramodi) September 22, 2020
సస్పెండై ఆందోళన చేస్తున్న వారిలో డెరెక్ ఓ బ్రెయిన్,సంజయ్ సింగ్, రాజు సతవ్, కేకే రాగేశ్, రిపున్ బొరా, డొలా సేన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, ఎలమారన్ కరిమ్ ఉన్నారు. వ్యవసాయ రంగ బిల్లుల ఆమోదం సమయంలో వీరు బిల్లు పత్రాలను చించివేశారు. గట్టిగా కేకలు వేస్తూ రభస సృష్టించారు. డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ వారించినా వినలేదు. దీంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లులను ఆమోదింపచేశారు.
బిల్లుల ఆమోదం సమయంలో రభస సృష్టించడంతో ఎనిమిది మంది ఎంపీలను రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. వారం రోజుల పాటు సెషన్ అయిపోయేవరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Be the first to comment