
దౌల్తాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ ముబారస్ పూర్లో మంత్రి హరీశ్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాతని, ఇందులో అలాంటి అనుమానం లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఢిల్లీలో, గల్లిలో ఏమీలేదన్నారు.
కేరళ కాదు.. దుబ్బాక..!
జోరు వర్షంలోనూ చెక్కు చెదరని అభిమానం
దుబ్బాక లో ప్రజా తీర్పు గులాభి పార్టీ వైపే..#DubbakaWithTRS #VoteForCar 🚘 pic.twitter.com/LILvJucJnU— Harish Rao News (@TrsHarishNews) October 13, 2020
70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, తెదేపా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదని చెప్పారు. దేశంలో, కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా బీడీల పెన్షన్లు ఇవ్వడం లేదని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లా రాత్రి దొంగ కరెంట్ వస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఉన్నపుడు కరెంట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెడితే నేడు భాజపా మీటర్లు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందన్నారు.
దుబ్బాక నియోజకవర్గం చీకోడు గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గారితో కలిసి పాల్గొన్న మంత్రి శ్రీ @trsharish.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
– కాంగ్రెస్, బీజేపీలు గోబెల్స్ ప్రచారంతో ఓట్లు అడుగుతున్నారు#VoteForCar #DubbakaWithTRS pic.twitter.com/kgebbl0uVn
— TRS Party (@trspartyonline) October 16, 2020
కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని హరీశ్ అన్నారు. వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు ఓట్లు వచ్చినపుడు కాంగ్రెస్, భాజపా నాయకులు వచ్చి పోతారని ఎద్దేవా చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తోంది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు.
దుబ్బాక నియోజకవర్గ కేంద్రం లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో @trspartyonline అభ్యర్థి సోలిపేట సుజాత రెడ్డి గారితో కలిసి మంత్రి @trsharish గారు వారి నామినేషన్ పత్రాలు అందజేసారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. pic.twitter.com/81a597kLJq
— Harish Rao News (@TrsHarishNews) October 14, 2020
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు భూమి సిస్సు వసూలు చేస్తే, నేడు రైతుకు పెట్టుబడి సాయం చేసున్న ప్రభుత్వం టీఆర్ఎస్దేనని హరీశ్ చెప్పారు. కాంగ్రెస్, భాజపా ఎండమావులు వంటివని, వారి వెంటపొతే ఏమి రాదన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసున్న టీఆర్ఎస్కే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలన్నారు.
దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండలం, అందే గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సోలిపేట సుజాత గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి శ్రీ @trsharish.#DubbakaWithTRS #VoteForCar pic.twitter.com/tFj4XY4zGk
— TRS Party (@trspartyonline) October 9, 2020
Be the first to comment