
వారి గళం మధురం
వారి మాటలు అపురూపం
ఎంతోమంది శ్రోతల మనసులు దోచుకున్న రేడియో జాకీలు నేడు రచనా రంగంలో తమ కలం బలం చూపిస్తున్నారు.
ఆల్ ఇండియా రేడియో వివిధ శాఖలకు చెందిన అలనాటి, నేటి మహిళా అనౌన్సర్లు నేడు కథా రచయిత్రులుగా మన్ననలు అందుకుంటున్నారు.
తెలుగు రచయితలను ప్రోత్సహిస్తున్న ఉస్మానియా రచయితల సంఘం మినీ కథల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో రేడియో జాకీలు, అనౌన్సర్లు, రచయిత్రులైన మంజీత కుమార్, లక్ష్మీ కిరణ్ పెండ్యాల, మాధురి ఇంగువ, శివరంజని, రేణుక బెజవాడ 25 సందేశాత్మక మినీ కథలను రాయడంలో సఫలీకృతమయ్యారు. ఇందుకుగాను ఈ ఐదుగురికి ‘గాథ సృజన సంయమి’ పురస్కారం లభించింది.
మంజీత కుమార్ – ఈక్షణం ఫీచర్స్ ఇంచార్జీ, రచయిత్రి, షార్ట్ ఫిల్మ్ రైటర్, FM రెయిన్బో రేడియో జాకీ (గతంలో)
Manjeetha Sathyanarayana Manjeetha Kumar
లక్ష్మీ కిరణ్ పెండ్యాల – రచయిత్రి, పాటల రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్, FM రెయిన్బో రేడియో జాకీ (ప్రస్తుతం)
లక్ష్మీ కిరణ్ పెండ్యాల
మాధురి ఇంగువ – కథ, సీరియల్స్ రచయిత్రి, డబ్బింగ్ ఆర్టిస్ట్, FM రెయిన్బో రేడియో జాకీ (గతంలో), షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్
రేణుక బెజవాడ – రచయిత్రి, యూ ట్యూబర్, FM రెయిన్బో రేడియో జాకీ (ప్రస్తుతం)
Renuka Bezawada
శివరంజని – రచయిత్రి, యువవాణి తెలుగు అనౌన్సర్ (గతంలో)
Be the first to comment