
హైదరాబాద్, సూర్యాపేట: లడక్ గల్వాన్ లోయలో చైనా కుట్రపూరితంగా చేసిన దాడిలో అమరుడైన కల్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించారు. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్బాబు నివాసానికెళ్లిన సీఎం కల్నల్ కుటుంబసభ్యులను పరామర్శించారు. కల్నల్ సతీమణి సంతోషితో, కల్నల్ సంతోష్ తల్లిదండ్రులతో సీఎం మాట్లాడారు. ఓదార్చారు. తాను మాట ఇచ్చినట్లుగానే రూ.5 కోట్ల చెక్కు, నివాస స్థల పత్రాలు కల్నల్ కుటుంబానికి అందజేశారు. అంతేకాదు కల్నల్ కుటుంబానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 711 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. సంతోష్ భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందజేశారు. అంతకు ముందు కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం శ్రీ కేసీఆర్ ఇవాళ సూర్యాపేటలో పరామర్శించి కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలు చల్లి అంజలి ఘటించారు. pic.twitter.com/KQ9MTpO3IS
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2020
CM has personally handed over the letter appointing Ms. Santoshi as the Group I officer and handed over the documents allotting 711 Sq. Yards of house site in Hyderabad to Ms. Santoshi. CM gave a Cheque for Rs. 4 Crore to Ms. Santoshi and Rs. 1 Crore to Col Santosh’s parents.
— Telangana CMO (@TelanganaCMO) June 22, 2020
సీఎం కేసీఆర్ తమను పరామర్శించడానికి తమ ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని సంతోష్ బాబు తల్లి అన్నారు.
మరోవైపు తమను పరామర్శించిన సీఎం కేసీఆర్కు కల్నల్ సంతోష్ కుమార్ సతీమణి సంతోషి ధన్యావాదాలు తెలిపారు. గల్వాన్ లోయలో అమరులైన ఇతర జవాన్లకు కేసీఆర్ ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ తన పిల్లలతో కూడా కొద్దిసేపు గడిపారని సంతోషి చెప్పారు.
Be the first to comment