
హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ …. విద్యార్థులు, యువతీ, యువకులకు ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసింది. భగవద్గీత ద్వారా ఆచరణాత్మక ధ్యానం పేరిట వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద సారధ్యంలో ఐదు రోజుల తరగతులు నిర్వహించనున్నారు. భగవద్గీతలోని 12వ అధ్యాయం ‘భక్తి యోగం’ ద్వారా ధ్యానం గురించి చెప్పనున్నారు. జూలై 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ తరగతులు సాయంత్రం 6.00 గంటలకు మొదలై 7.15 గంటల వరకు ముగియనున్నాయి. 16 ఏళ్లు పైబడిన వారు అర్హులు.
మరిన్ని వివరాలకు 9177232696 నంబర్కు ‘Hi’ అని వాట్సాప్ మెసేజ్ చేయగలరు. లేదా hyderabad.vihe@rkmm.orgకు మెయిల్ చేయగలరు.
Be the first to comment