
రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఆర్యజనని వర్క్షాప్
హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణమఠం ఆర్యజనని ఆధ్వర్యంలో ఆర్యజనని వర్క్షాప్ జరగనుంది. ఈ నెల 11న శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఈ వర్క్షాప్ జరగనుంది.
రిజిస్ట్రేషన్ కోసం www.aaryajanani.org ను క్లిక్ చేయాలని ఆర్యజనని నిర్వాహకులు తెలిపారు. శిశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ, సంస్కారమే.. ఆ శిశువు ఉన్నతుడిగా ఎదగడానికి కారణభూతమవుతుందని ఆర్యజనని టీమ్ సభ్యులు చెబుతున్నారు. దైవం పట్ల భక్తి, శ్రద్ధలు కలిగిన తల్లులకు ఉన్నతమైన వ్యక్తులు జన్మిస్తారని స్వామి వివేకానంద చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. శిశువు జననానికి సంబంధించిన ఆధునిక విజ్ఞానం ఈ కార్యక్రమం ద్వారా అందించనున్నారు. ఈ వర్క్ షాప్లో ధ్యానం, భజనలు, యోగాసనాలు ఇతర విషయాలు నేర్పిస్తారు. అలాగే గర్భిణులకు ఉపయోగపడే దినచర్యను ఉపదేశిస్తారు. ఉత్తమ బిడ్డకు జన్మనివ్వడానికి అవకాశం కల్పిస్తారు.
Be the first to comment