Breaking News: బీజేపీ అంటే చెత్తకుప్ప అనుకుంటున్నారా?.. కొండా సురేఖ చేరికపై మురళీధర్‌రావు ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, క్షణం: మాజీ మంత్రి కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావడంపై ఆ పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సురేఖ చేరికకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు మురళీధర్‌రావు ఘాటైన వ్యాఖ్యలతో స్పందించినట్లు సమాచారం. బీజేపీ అంటే చెత్తకుప్పగా భావిస్తున్నారా? అన్న రీతిలో ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావడానికి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సురేఖ బీజేపీలో చేరికపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎంపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇదే సమయంలో బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు చేసిన ఘాటు సోషల్‌ మీడియా పోస్ట్‌ ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా!” అన్న వ్యాఖ్యలతో ఆయన స్పందించారు.

సురేఖ చేరిక అంశంపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న చర్చ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం వైఖరిపై కూడా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలోని బీజేపీ విలువలు, సిద్ధాంతాలకు అనుగుణంగా రాజకీయాలు చేస్తుందని చెప్పుకునే పార్టీ.. రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుందా? అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి.

Leave a Reply