Breaking News: వరి వేస్తే నష్టమే.. ప్రత్యామ్నాయ పంటలే మేలు: కలెక్టర్

సూర్యాపేట, ఈ క్షణం: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగు చేసి నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవద్దని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని.. రానున్న రోజుల్లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం తక్కువగా ఉందని…

శ్రీశైలానికి భారీగా వరద.. నాగార్జునసాగర్‌లోనూ పెరుగుతున్న ప్రవాహం

Srisailam, Nagarjuna Sagar

శ్రీశైలం/నాగార్జునసాగర్, ఈ క్షణం: కృష్ణా బేసిన్‌లో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 877.70 అడుగులకు చేరగా.. నాగార్జునసాగర్‌లోనూ ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలానికి 1.68 లక్షల…

Eekshnam Exclusive: గ్రాడ్యుయేట్‌ బరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌?

Bura Narsaiah Goud

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రంగంలోకి దింపే దిశగా అడుగులు వేస్తుండగా, బీజేపీ మాత్రం బీసీ కార్డును ప్రయోగించే అవకాశాలపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.…