Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నామస్మరణ ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కలియుగంలో భక్తులను కాపాడుతూ, వారి కష్టాలను తొలగిస్తూ, ధర్మమార్గంలో నడిపించే దైవస్వరూపంగా శ్రీవారిని కొలుస్తారు. తిరుమల కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్యరూపాన్ని దర్శించడం భక్తులకు ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగిస్తుంది. స్వామివారి సన్నిధిలో భక్తితో పలికే “గోవిందా!…

నల్లగొండ, ఈ క్షణం: తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 22A జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల 22A భూముల అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర…

యాదాద్రి భువనగిరి, ఈ క్షణం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటర్ల జాబితా సవరణలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ రాజకీయాల్లో బీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై కొత్త చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్ను ఎదుర్కొనే క్రమంలో పార్టీ సొంత కార్యక్రమాలతో పాటు.. ఇతర ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న ప్రజా సమస్యల కార్యక్రమాల్లోనూ బీఆర్ఎస్ నేతలు కనిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్…

హైదరాబాద్, ఈ క్షణం: హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు మారబోతున్నాయి. H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో స్టీల్ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్ అండర్పాస్ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మార్పు ప్రధానంగా బంజారాహిల్స్,…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో చర్చకు తెరలేపారు. ఇప్పటివరకు ప్రభుత్వాలను, పార్టీలను, రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన ఆయన.. తాజాగా తన రాజకీయ దృష్టిని మరింత విస్తృతం చేసినట్లు కనిపిస్తోంది. “రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది.. నా నిజాయితీనే నా బలం”…

మహబూబాబాద్, ఈ క్షణం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో వ్యక్తిగత పనులు చేయించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్ వైరల్గా మారిన…
నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఐకాన్ ఆసుపత్రిలో వైద్యం పొందిన తమ కుటుంబ సభ్యుల చికిత్సకు భారీగా బిల్లులు వసూలు చేశారంటూ పలువురు బాధితులు జిల్లా వైద్యారోగ్య శాఖను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత చికిత్స ఖర్చులు భారీగా పెరిగాయని, వాటిని భరించేందుకు ఆస్తులు విక్రయించాల్సి వచ్చిందని కొందరు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: జిల్లా కేంద్ర ఆసుపత్రిలో బాలింత మమత ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెనక ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, భద్రతా వ్యవస్థ వైఫల్యం, అవుట్సోర్సింగ్ సిబ్బంది అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆసుపత్రి వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా గడువు ముగిసిన అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టును కొనసాగించడమే ఇలాంటి ఘటనలకు…

నల్లగొండ ప్రతినిధి, ఈ క్షణం: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మరోసారి ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ను రాజకీయంగా బలహీనపర్చే లక్ష్యంతో గతంలో అనుసరించిన వ్యూహాన్ని బీఆర్ఎస్ మరోసారి తెరపైకి తీసుకురావాలని చూస్తోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు…