బ్రేకింగ్ న్యూస్

KTR at BRS Rythu Maha Dharna in Miryalaguda

మిర్యాలగూడలో రైతు గర్జన.. కేటీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్‌ రైతు మహాధర్నా

మిర్యాలగూడ, ఈ క్షణం: కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన రైతు మహాధర్నాకు భారీ స్పందన లభించింది. ఎన్ఎస్పీ క్యాంపు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ముఖ్య అతిథిగా హాజరై…

Konda Surekha, Revanth Reddy,Gadwal Vijayalakshmi

Breaking News: కొండా సురేఖ బర్తరఫ్.. గద్వాల్ విజయలక్ష్మి కి ప్రమోషన్..

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అధిష్ఠానం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గడువు విధించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, గవర్నర్ (లోక్‌భవన్)కు బర్తరఫ్…

Breaking News: భగ్గుమన్న నల్గొండ.. బీజేపీ, కాంగ్రెస్ కోడిగుడ్లు, టమాటాలతో దాడులు

నల్లగొండ, ఈ క్షణం: హైదరాబాద్‌లో చోటుచేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ ఘర్షణల ప్రభావం నల్లగొండ జిల్లాకూ పాకింది. ఇరుపార్టీల శ్రేణులు పరస్పర నిరసనలు, దాడులకు దిగడంతో జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…

Breaking News: సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ పరోక్ష ఫిర్యాదు.. టీపీసీసీకి సంచలన లేఖ

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని…

konda-surekha-cabinet-removal-g-chinna-reddy-congress-action

Eekshanam Exclusive: కొండా సురేఖకు మంత్రి పదవి ఔట్?

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ఛైర్మన్ జి. చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తాజా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి కూడా అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం.…

Konda Susmitha, Revanth Reddy, Konda Surekha,

Breaking News: రేవంత్‌పై కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం..

వరంగల్/పరకాల, ఈ క్షణం: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పరకాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి…

Telangana movie ticket prices 2026

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త రేట్లు.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ఈ క్షణం: తెలంగాణలో సినిమా థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు హోం (జనరల్) శాఖ G.O.Ms.No.77ను ఆగస్టు 14, 2026న జారీ చేసింది. 2021 డిసెంబర్ 21న జారీ చేసిన G.O.Ms.No.120ను అధిగమిస్తూ తాజా ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని నాన్‌-ఏసీ, ఏసీ/ఎయిర్‌…

Komatireddy Venkat Reddy

22A జాబితాపై సమగ్ర విచారణ.. బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ, ఈ క్షణం: తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 22A జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ చేపడతామని, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇటీవల 22A భూముల అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర…

Traffic Alert

KBR Park Traffic Alert: ఆగస్టు 18 నుంచి వన్‌వే.. ఈ రూట్లలో భారీ మార్పులు

హైదరాబాద్‌, ఈ క్షణం: హైదరాబాద్‌లో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ నిబంధనలు మారబోతున్నాయి. H-CITI ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో స్టీల్‌ ఫ్లైఓవర్లు, డైరెక్షనల్‌ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు 18, 2026 నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మార్పు ప్రధానంగా బంజారాహిల్స్‌,…

Breaking News: కేజీబీవీలో విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌.. వీడియో వైరల్‌

మహబూబాబాద్, ఈ క్షణం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో ఓ ఇంగ్లిష్‌ ఉపాధ్యాయురాలి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో వ్యక్తిగత పనులు చేయించుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినితో జడ వేయించుకున్న టీచర్‌ వైరల్‌గా మారిన…