Breaking News: కొండా సురేఖ బర్తరఫ్.. గద్వాల్ విజయలక్ష్మి కి ప్రమోషన్..

హైదరాబాద్ ఏపీబీ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసింది. అధిష్ఠానం సాయంత్రంలోగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని గడువు విధించినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో, గవర్నర్ (లోక్‌భవన్)కు బర్తరఫ్ లేఖను పంపి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాల ద్వారా స్పష్టమవుతోంది.

ఈ సంచలన నిర్ణయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్‌పర్సన్ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

నియామకం / నిర్ణయంనాయకులు / వివరాలు
మంత్రివర్గం నుంచి బర్తరఫ్కొండా సురేఖ
ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ (కొత్త)గద్వాల్ విజయలక్ష్మి (జి. చిన్నారెడ్డి నియామకం రద్దు)
మహిళా కమిషన్ చైర్‌పర్సన్నెరెళ్ల శారద
కుడా (KUDA) చైర్‌పర్సన్గుండు సుధారాణి (మాజీ ఎంపీ)

ఒక్కసారిగా వేగవంతమైన ప్రభుత్వ నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు (Planning Board) వైస్ చైర్మన్‌గా గతంలో ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ విజయలక్ష్మిని వైస్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ సీఎమ్‌ఓ ఆదేశాలు ఇచ్చింది.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు నెరెళ్ల శారదను ప్రభుత్వం నియమించింది. మహిళా భద్రత, హక్కుల పరిరక్షణ దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వరంగల్ రాజకీయ సమతుల్యతను కాపాడే దిశగా.. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయంలో సుధారాణి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. కొండా సురేఖపై వేటు వేయడం, అదే సమయంలో కీలకమైన స్థానాల్లో సత్వర నియామకాలు చేపట్టడం ద్వారా పాలనపై, పార్టీపై తనకు పూర్తి పట్టు ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

Leave a Reply